పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు ఎట్టకేలకు ప్రారంభమైంది.ఈరోజు సికింద్రాబాద్ పరిసరాల్లో షూటింగ్ మొదలుపెట్టారు.
రెండువారల పాటు హైదరాబాద్ లోనే షూట్ చేస్తారట.ఇక పవన్ కళ్యాణ్ శనివారం నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం.
శృతిహాసన్ కథానాయికగా నటించబోతున్న ఈ చిత్రానికి డాల్లి దర్శకుడు, శరత్ మరార్ నిర్మాత.
ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమా మొదలుపెడతాడు పవర్ స్టార్.
ఇక్కడివరకు అందరికి తెలిసిన విషయాలే.ఆ తరువాత సినిమా ఎవరితో అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
తమిళ దర్శకుడు నీసన్ తో వేదాలం రీమేక్ మొదలవుతుందా లేక దాసరి నిర్మాణంలో సినిమా షురు చేస్తారా అనేది అభిమానులకి అంతుపట్టడం లేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం “బోస్ – The Son of India” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిన దాసరి నారాయణరావు, ఈ సినిమాని డైరెక్ట్ చేయమని బోయపాటి శ్రీనుని సంప్రదిస్తే, చేయలేనని ముక్కుసూటిగా సమాధానమిచ్చారట బోయపాటి.
ఈ సినిమాకి బదులుగా తన కథతో చేయమంటేనే చేస్తాను తప్ప, దాసరి కథని డైరెక్ట్ చేయడం తనతో జరిగే పని కాదని బోయపాటి చెప్పి పంపించేశాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.