మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చేందుకు తనకు ఎంతగానో కలిసొచ్చిన నందమూరి బాలకృష్ణతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోయపాటి, బాలయ్య కోసం పవర్ఫుల్ స్క్రిప్టును రెడీ చేశాడట.ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ను ఇటీవల అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
అయితే ఈ టైటిల్ టీజర్కు ఊహించనీ రీతిలో రెస్పాన్స్ రావడంతో బోయపాటి ఈ సినిమాను మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.బాలయ్య చిత్రంలో ఏయే అంశాలు ఉండాలో వాటన్నింటినీ పక్కాగా ఉండేలా చూస్తున్నాడు.
కాగా ఈ సినిమాకు చిత్ర యూనిట్ తొలుత అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఖర్చవుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.దీంతో ఈ సినిమాలో పనిచేస్తున్న వారు తమ రెమ్యునరేషన్ను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.బాలయ్య కూడా తన రెమ్యునరేషన్ను రూ.10 కోట్ల నుండి రూ.7 కోట్లకు తగ్గించాడట.అటు దర్శకుడు బోయపాటి కూడా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఆయన ఈ సినిమా షేర్స్లో వాటా తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాపై ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడని, అందుకే ఈ సినిమా షేర్స్లో వాటా తీసుకుంటున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.
ఏదేమైనా బాలయ్యతో అదిరిపోయే హ్యా్ట్రిక్ కొట్టి తీరుతానని కాన్ఫిడెంట్గా ఉన్న బోయపాటి, అఖండ చిత్రాన్ని ఏ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడో, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.