టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు.ఈయన సినిమాలు తీసే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
అయితే యాక్షన్ మరీ ఎక్కువైనా కష్టమే అని వినయ విధేయ రామ సినిమా నిరూపించింది.భారీ ప్లాప్ చూసిన తర్వాత బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా వీరిద్దరి కెరీర్ లోనే మైలు రాయిలా నిలిచి పోయినది.
అఖండ సినిమాతో అఖండ మైన విజయం అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
వీరి కాంబోకి తిరుగులేదని మరొకసారి నిరూపించాడు బోయపాటి.ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించిన తర్వాత బోయపాటి శ్రీను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయాలని అనుకున్నాడు.
ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కేరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచి పోయింది.
మరోసారి వీరిద్దరూ సినిమా చేయాలనీ అనుకున్నారు.బన్నీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది.పుష్ప సినిమా హిట్ తో బన్నీ కూడా మంచి ఊపు మీద ఉన్నాడు.
అయితే వీరిద్దరూ సినిమా మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ సుకుమార్ పుష్ప 2 సినిమా కూడా వెంటనే తెరకెక్కించాలని అనుకోవడంతో బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీ కానున్నాడు.
దీంతో బోయపాటి బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో మరొక హీరోతో సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
బోయపాటి రామ్ పోతినేని తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాకు కూడా మిర్యాల రవీందర్ రెడ్డి నే నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
త్వరలోనే ఈ సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.