నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న కొత్త సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.బాలయ్యని ఎలా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో కరెక్ట్ గా తెలిసిన వ్యక్తి బోయపాటి.
వినయ విదేయ రామా లాంటి డిజాస్టర్ తర్వాత బోయపాటి బాలయ్యతో ఈ సినిమా చేస్తూ ఉండటంతో ఓ వైపు ఫ్యాన్స్ లో టెన్షన్ ఉన్న, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కొంత నమ్మకంగా ఉన్నారు.మరో సారి ఈ సినిమా కోసం బాలయ్య డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
అందులో ఒక పాత్రలో గ్రామంలో రైతుగా కనిపించానుండగా, మరో పాత్రలో అఘోరాగా డిఫరెంట్ గెటప్ లో దర్శనం ఇవ్వనున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది.అలాగే పూర్ణ మరో కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఇదిలా ఉంటే బోయపాటి సినిమా అంటే పవర్ ఫుల్ విలనిజం ఉంటుంది.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాల విషయంలో ఇది రుజువైంది.ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం బోయపాటి దించే పవర్ ఫుల్ విలన్స్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.అయితే దీని గురించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకున్నా ఇందులో ఇద్దరు విలన్స్ బాలయ్యతో పోటీ పడబోతున్నారని తెలుస్తుంది.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒక విలన్ గా కనిపించబోతూ ఉండగా మరో పవర్ ఫుల్ విలనీగా హీరో శ్రీకాంత్ సర్ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఈ ఇద్దరు విలన్స్ తో బాలయ్య పోరాటం చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని వినికిడి.
ఇక బాలయ్యకి భాగా అచ్చొచ్చిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ ని ఈ సినిమా కోసం బోయపాటి తీసుకోవడం విశేషం.