మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను లాస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా కథ, యాక్షన్ సీన్స్(అదే.ఓవర్ యాక్షన్ సీన్స్)కు ప్రేక్షకుల మైండ్లు కొంతసేపు పనిచేయడం మానేశాయి.
ఆ రేంజ్లో ఈ సినిమాపై విమర్శలు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ఫ్లాప్గా నిలిచింది.దీంతో తన నెక్ట్స్ చిత్రంతో ఎలాగైనా బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.
తనకు ఎంతో కలిసొచ్చిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి ముచ్చటగా మూడో సినిమాను స్టార్ట్ చేశాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమాను గతంలో వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ కంటే కూడా ఎక్కువ విజయాన్ని అందుకునేలా బోయపాటి శ్రమిస్తున్నాడు.దీంతో ఈ సినిమాలోని స్క్రిప్టులో పలుమార్లు మార్పులు చేస్తూ వస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ను మళ్లీ మారుస్తున్నాడట బోయపాటి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను చివరిదశకు తీసుకొచ్చిన చిత్ర యూనిట్, కొన్ని సీన్స్ను మాత్రం మరోసారి మార్పులు చేసి తెరకెక్కించాలని చూస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వేసవి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
మరి బాలయ్య కోసం స్క్రప్టులో పలుమార్లు చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న బోయపాటి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.