నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బోయపాటి బాలయ్య సినిమా అప్డేట్ రావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినా ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.
కానీ మొన్న ఉగాదికి బోయపాటి నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసాడు.
ఈ సినిమా కు అఖండ అనే టైటిల్ ను పెట్టారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పెద్ద అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు చేయబోయే సినిమా కూడా ఆ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని అఖండ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాడు బోయపాటి.
రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి పోయిన పేరును తిరిగి సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నాడు.
ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ తో పాటు ఎమోషన్ కూడా ఉండేలా బోయపాటి ఈ సినిమాను తీస్తున్నాడని టాక్.ఈ రెండు మిస్ అవ్వకుండా బోయపాటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్.ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ గా చూపించి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడని టాక్.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.