నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న హ్యాట్రిక్ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఆరంభం నుంచి చాలా రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నా దర్శకుడు బోయపాటి మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.
ఆరంభంలో సినిమాలో విలన్ గా శ్రీకాంత్ ని ఎంపిక చేశారని టాక్ వినిపించింది.అయితే అందులో వాస్తవం ఎంత ఉంది అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.
అలాగే హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపించాయి.వీటిపైనా కూడా బోయపాటి స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు.మరల ఇప్పుడు షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.
బోయపాటి, బాలయ్య సినిమాలు అంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటుంది.ఆర్టిస్ట్ లు కూడా ఎక్కువ మంది ఉంటారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చే వరకు వేచి చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.
ఇందులో ముందుగా రోజా ఓ కీలక పాత్రలో నటిస్తుంది అంటూ ప్రచారం జరిగింది.ఇప్పుడు ఆమె స్థానంలో వెటరన్ స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలైన జయప్రదని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఓ కీలకపాత్ర చేసేందుకు బోయపాటి జయప్రదను సంప్రదించారని అందుకు ఆమె కూడా అంగీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో బాలయ్య మహారథి చిత్రంలో జయప్రద అతనికి అత్తగా నటించింది.
అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వీరి కాంబినేషన్ పై మళ్ళీ ఎవరూ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు.ఇప్పుడు బోయపాటి ఈ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంటుందని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.