అమెరికాలోని ఓక్లహోమాలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.ఓ యువతిని కాపాడాలని నదిలో దూకిన యువకుడు ఆమెని కాపాడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
దాంతో అతడి కుటుంభం తీవ్ర విషాదంలో ఉండిపోయింది.వివరాలలోకి వెళ్తే.
ట్రయాన్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి నదిలో ప్రయాణిస్తున్నాడు.ఒక్క సారిగా ఆ నదిలో తమ కళ్ళముందు ఓ మహిళ నదిలో మునిగిపోతూ కనిపించింది.
దాంతో ముగ్గురు ఆమెని కాపాడటానికి ఒక్క సారిగా నదిలో దూకేశారు.అయితే ట్రయాన్తో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు యువతిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు ఆమె సురక్షితంగా ఉంది.
కానీ ట్రయాన్ మాత్రం ఎంతకీ రాకపోవడం, కనిపించక పోవడంతో పోలీసులకి సమాచారం అందించారు.దాంతో హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గజ ఈతగాళ్ళ సాయంతో నదిలో వెతికించారు.
సుమారు 8 అడుగుల లోతులో ట్రయాన్ విగత జీవుడిగా పడిఉన్నాడు.
ట్రయాన్ చిక్కషాకు చెందిన 34 ఏళ్ల జచారీ ఏ ట్రయాన్గా గుర్తించిన పోలీసులు అతడి ప్రాణాలు పోవడం దురదృష్ట కరమని అన్నారు.
అయితే ఈత వచ్చిన ట్రయాన్ నదిలో ఎందుకు ప్రాణాలు విడిచాడు.ఒక వేళ ఈత రాకపోతే ఎందుకు వెళ్లినట్టు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.