చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు రోడ్డు దాటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.రోడ్డు దాటేటప్పుడు వారి చేతులు గట్టిగా పట్టుకుని రోడ్డు దాటుతారు.
అయితే ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం వారు తల్లడిల్లిపోతారు.కానీ ఓ కారు రోడ్డు దాటుతున్న తల్లికొడుకులను గట్టిగా గుద్దింది.
సౌత్ చైనా పోస్ట్ పేరుతో సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న తల్లికొడుకులను కారు గట్టిగా గుద్దడంతో వారు ఎగిరి దూరంగా పడ్డారు.
వెంటనే తేరుకున్న ఆ బుడతడు తన తల్లికి ఏమైనా గాయాలయ్యాయా అంటూ అడగసాగాడు.తన తల్లి బాధతో విలవిలలాడుతుండటం చూసిన ఆ బుడతడు కోపంతో ఊగిపోయాడు.
వెంటనే తమను గుద్దిన కారును కాలితో గట్టిగా తన్నాడు.సదరు కారు యజమానిపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా కారు యజమాని సదరు బాధితురాలిని తన కారులోనే తీసుకెళ్లాడు.ఆ బుడతడి ఆగ్రహం, తల్లిపై అతడి ప్రేమను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు.
దీంతో వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.బుడతడి తెగింపుకు వారు శభాష్ అంటున్నారు.