ఏ తల్లిదండ్రుల కైనా పిల్లల సంతోషమే ముఖ్యం.వారు ఏది కావాలన్నా కూడా వెనకడుగు వేయకుండా వారికి కావలసినది కొనిచ్చి పిల్లలని సంతోష పరుస్తారు.
ఏ తల్లి తండ్రయినా కూడా పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచుకోవాలని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఒక బాలుడు కొత్త సైకిల్ కావాలని తల్లిదండ్రులను అడగగా.
వారు తన కొడుకు అడిగిన కోరికను కాదనలేక కొత్త సైకిల్ ను కొని పెట్టడం జరిగింది.అయితే ఆ సైకిల్ తన కొడుకు ప్రాణం తీసుకుంటుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు.
సరదాగా సైకిల్ తొక్కుకుంటూ ఆ చిన్నారి బావిలో ప్రమాదవశాత్తు పడి శవమై కనిపించాడు.
ఈ విషాద సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న లక్ష్మీపూర్ లో జరిగింది.
ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే … లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రేవంత్ అనే బాలుడు సైకిల్ పై వెళుతూ అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి తిరుగు రాని లోకాలకు చేరుకున్నాడు.తాజాగా తన తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనివ్వడంతో ఆ బాలుడు సరదాగా ఇంటి సమీపంలో ఆడుకోవడం జరిగింది.
ఇక ఆ సరదా కాస్త ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ఆ బాలుడు పడి మృతి చెందాడు.
ఇక చివరకు సాయంత్రం అయినా కూడా తన కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా కూడా కలియ తిరిగారు, అయినా కూడా బాలుడు జాడ ఎక్కడ లభించలేదు.
దీనితో స్థానికులు తెలియజేసిన సమాచారం మేరకు… ఒక వ్యవసాయ బావిలో గాలింపు చేయగా బాలుడి మృతదేహంతో పాటు సైకిల్ కూడా కనిపించడం జరిగింది.కొత్తగా కొనిచ్చిన సైకిల్ తో సరదాగా ఆడుకునేందుకు వెళ్ళిన తమ కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకానికి లోనయ్యారు.