మన భారతదేశంలో అత్యంత అదరణీయమైన క్రీడ ఏదైనా ఉంది ఏది అంటే క్రికెట్.ఇలా అత్యంత ఆదరణ గల క్రికెట్ లో ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పిచ్చి.
ఎందుకంటే క్రికెటర్లను దేవుళ్ళుగా పూజించే అభిమానులు ఉన్న మనదేశంలో ఐపీఎల్ ను ఎంత గొప్పగా ఆదరిస్తారో మనం చూసే ఉన్నాం.అయితే ఐపీఎల్ లో మన దేశీయ ఆటగాళ్లే కాక విదేశీ ఆటగాళ్లకు కూడా ప్రాధాన్యత ఇస్తారు.
అయితే వారు క్రిందటి ఐపీఎల్ లో ప్రదర్శనను, అదే విధంగా ప్రస్తుతం వారికున్న ఫామ్, వారికున్న ప్రతిభను బట్టి వేలం వేసి తీసుకుంటారు.ఇక ఈ మూడిట్లో దేనిలో సరిగ్గా లేకపోయినా అతనిని వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు వారి వారి టీమ్ లోకి తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు.
అయితే ఇలా వేలంలో వారికి సరైన ప్రాధాన్యత కల్పించకపోతే వారు ఏదో ఒక విధంగా ఐపీఎల్ పై విమర్శలు చేస్తుంటారు.ఇక ఈ జాబితాలో డేల్ స్టెయిన్ కూడా చేరడం జరిగింది.
తాజాగా ఐపీఎల్ పై డెయిల్ స్టెయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.పెద్ద జట్లు,పేరున్న ఆటగాళ్లతో పాటు చాలా ఆదాయం వస్తుంది.
అందుకే అక్కడ ఆటను మర్చిపోతారు.ఇతర దేశాల లీగుల్లో క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, భారత్ లో దానికి పూర్తిగా రివర్స్ లో ఉంటుందని వారన్నారు.
ఏది ఏమైనా డెయిల్ స్టెయిన్ పై భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంత మాట్లాడుతున్నవాడివి ఐపీఎల్ ఎందుకు ఆడావు అని నెటిజన్లు డెయిల్ స్టెయిన్ కు కౌంటర్ ఇస్తున్నారు.