ఏపీ రాజధాని అమరావతి విషయంలో గతంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారంను రేపిన విషయం తెల్సిందే.ఆయన మాటలు రాజధాని మార్పు ఖాయం అన్నట్లుగా ఉండటంతో ఒక్కసారిగా తీవ్ర వివాదం చెలరేగింది.
తాను అలా అనలేదు అంటూ, మీడియా తన మాటలను అపార్ధం చేసుకుంది అంటూ బొత్స మాట మార్చే ప్రయత్నం చేశాడు.తాజాగా మరోసారి అమరావతి విషయంలో మంత్రి బొత్స మాట్లాడాడు.
గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో కనీసం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, ఆయన దృష్టిలో అమరావతి తాత్కాలిక రాజధాని అని మాత్రమే అంటూ బొత్స అన్నారు.
హైదరాబాద్ నుండి అర్ధరాత్రి పారిపోయి వచ్చి రాష్ట్రంకు అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ బొత్స తీవ్ర విమర్శలు చేశాడు.
ఇన్నాళ్లు తాత్కాలిక రాజధాని అంటూ ఉంచిన చంద్రబాబు నాయుడు అమరావతిని ఎక్కడ అభివృద్ది చేశాడో చూపించాలని సవాల్ విసిరాడు.అసలు అమరావతి గురించి నీవు అధికారంలో ఉన్న సమయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంటూ బొత్స కామెంట్స్ చేశాడు.
రాష్ట్రంకు వచ్చిన పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు వెనక్కు పోతున్నట్లుగా తెలుగు దేశం పార్టీ చేసిన విమర్శలపై కూడా బొత్స స్పందించాడు.మీరు అధికారంలో ఉన్న సమయంలో పెట్టుబడి దారులు తాత్కాలికంగా వచ్చి వెళ్లారు.
అంతే తప్ప ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు వస్తున్నారని బొత్స అన్నాడు.