ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఈనెల 14వ తారీకున మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్న విషయం తెల్సిందే.చిరంజీవికి తాజాగా జగన్ అపాయింట్మెంట్ ఖరారు చేయడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి మరియు జగన్ల భేటీ విషయమై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే చిరంజీవి వైకాపాలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని, ఆయనకు జగన్ చేస్తున్న పనులు నచ్చడంతో అభినందించేందుకు కలుస్తున్నాడంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు అల్లేస్తున్నారు.
మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించాడు.జగన్ కేవలం లంచ్కు మాత్రమే చిరంజీవిని ఆహ్వానించారంటూ బొత్స పేర్కొన్నాడు.ఇందులో రాజకీయ ఉద్దేశ్యం ఏమీ లేదని, సైరా సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో అభినందించేందుకు జగన్ చిరంజీవితో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆ సమయంలో ఎలాంటి రాజకీయ చర్చలు జరపబోవడం లేదు అంటూ బొత్స పేర్కొన్నాడు.