టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లోనే కాదు హిందీలో కూడా వరుస సినిమాల్లో బిజీగా ఉంది.టాలీవుడ్ లో స్టార్ లా సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
ఇక కన్నడ వంటి భాషల్లో కూడా నటించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో నటించిన ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ సినిమా ఓటీటీ లో విడుదలయింది.
అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, నీనా గుప్తా కీలక పాత్రలో నటించారు.
ఇక తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా సినీ బృందం ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ అందించింది.ఇక ఈ సందర్భంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది.
అంతేకాకుండా తన కుటుంబం గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.తన ఇద్దరు తాతయ్యలు పాకిస్తాన్ నుంచి వచ్చారని.
ఇక్కడ వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో తనకు తెలుసని తెలిపింది.ఇక తను వాళ్ళు చెప్పిన కథలు వింటూ పెరిగానంటుంది.
ఇక్కడికి రావడం కోసం వాళ్ళ తాతయ్యలు ఉన్నదంతా వదులుకున్నారని.అప్పట్లో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందని తెలిపింది.
ఇక ఈ సినిమా తన గుండెకు తాకిందంటూ.ఎందుకంటే తన తాతయ్య పాకిస్తాన్ లో తన ఇంటికి వెళ్లి రావాలని పదే పదే తన నాన్నతో అంటుండేవారని తెలిపింది.
కానీ భారత ఆర్మీ లో అధికారిగా సేవలందిస్తున్న తన నాన్నకు పంపించడం సాధ్యం కాకపోవడంతో.తన తాతయ్య కోరికను తన నాన్న తీర్చలేకపోయారని తెలిపింది.
ఇక తన నాన్న పదవి విరమణ పొందే సమయానికి తన తాతయ్య వయసు పైబడి ఉండటంతో.ఇప్పుడు అంత దూరం ప్రయాణించడం కష్టంగా మారిందని తెలిపింది.
ఇక ఆయన తనకు చెప్పిన కథల వల్లే ఈ సినిమాకు ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.