టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.నితిన్ కృతి శెట్టి జంటగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి నికితా రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నితిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అనే సినిమా ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని, ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.ఇక ఈ సినిమాలో తాను ఐఏఎస్ పాత్రలో కనిపిస్తానని నితిన్ వెల్లడించారు.
ఇక ఈ సినిమా ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.
ఇకపోతే ఇప్పటికే తాను ఎన్నో ప్రేమకథ సినిమాలలో నటించానని అయితే ఆ సినిమాలన్నీ చాలా బోర్ కొట్టడం వల్ల కొత్తగా ఐఏఎస్ పాత్రలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.ఇకపోతే ప్రేక్షకుల అభిప్రాయాల గురించి కూడా ఈయన స్పందించారు.కరోనా తర్వాత ప్రేక్షకులు మూడ్ ఎలా స్వింగ్ అవుతుందో తను అంచనా వేయలేకపోతున్నానని, ఈ విషయం గురించి తనకు అవగాహన రావడం లేదంటూ ఈ సందర్భంగా నితిన్ పేర్కొన్నారు.మొత్తానికి నితిన్ ఎన్నో అంచనాల.
ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా తనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.