బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా పోజిటివ్ వచ్చి ఒక్కసారిగా సంచలనంగా మారింది.ఇక ఆమె ప్రస్తుతం కరోనాకి చికిత్స తీసుకొని బయటపడింది.
ఆమె తరహాలోనే బాలీవుడ్ లో ఓ నిర్మాత కూతురుకి కూడా కరోనా సోకినట్లు తాజాగా బయటపడింది.తాజాగా ఓ బాలీవుడ్ నటుడు తన కుటుంబం మొత్తం కరోనా పోజిటివ్ కి గురయ్యామనే సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
రాక్ ఆన్ చిత్రంలో నటించిన పూరబ్ కోహ్లీ తాను, తన కుటుంబం కరోనా పాజిటివ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ద్వారా పూరబ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
పూరబ్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నాడు.తనతో పాటు తన భార్య లక్కీ, కుమార్తె ఇనాయా, కొడుకు ఓషన్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియజేశారు.
ఇక కరోనా తన కుటుంబంలో ఒకరితర్వాత ఒకరికి ఎలా వచ్చింది అందులో ప్రస్తావించారు.మొదట తన కుమార్తె ఇనాయాకు కరోనా వచ్చిందని, రెండు రోజుల తరువాత తన భార్యకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని తెలిపారు.
అనంతరం తనకు గొంతులో కఫం చేరిందని తెలిపారు.తనకు, తన భార్యకు 100-101 మధ్య జ్వరం వచ్చిందని, తన కుమార్తెకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యిందన్నారు.
తమ తర్వాత కుమారునికి కూడా అధిక జ్వరం వచ్చిందని చెప్పారు.అయితే తామంతా మొదటి నుంచి గృహ నిర్భంధంలో ఉండటంతో పాటు కరోనా పోజిటివ్ అని తెలిసాక ఇంట్లో ఉండే చికిత్స తీసుకోవడం జరిగిందని తెలిపాడు.
ఈ కారణంగా ఇప్పుడు తామంతా కరోనా నుంచి బయటపడ్డామని కూడా తెలియజేశాడు.మొత్తానికి ఈ నటుడు కరోనా సోకింది అని భయపడకుండా హోం క్వారంటైన్ లో ఉంటూ కరోనా నుంచి ధైర్యంగా బయటపడి ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు.