టాలీవుడ్ హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు వరకు చోరీ జరిగింది.ఫిబ్రవరి 9న తన అకౌంట్ నుంచి 3.82 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బోనికపూర్.ఏకంగా ఐదుసార్లు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే బోనీ కపూర్ తన క్రెడిట్ కార్డ్ నుంచి లక్షలు డబ్బులు చోరీ జరిగింది అని ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బోనికపూర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ కేసును ఫైల్ చేశారు.అయితే తన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు తెలుసుకున్న బోనికపూర్ వెంటనే ఆ విషయం గురించి బ్యాంకు అధికారులను సమాచారం కోరారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే తనను ఎవరూ క్రెడిట్ కార్డు వివరాలు అడగలేదని కనీసం ఫోన్ కాల్ కూడా రాలేదని తెలిపారు.కానీ తన క్రెడిట్ కార్డు వాడుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు డేటాను చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే బోని కపూర్ అకౌంట్ లో ఉన్న డబ్బులు గురుగ్రామ్ లోని ఒక కంపెనీ అకౌంట్ లోకి వెళ్లి నట్లు తెలుస్తోంది.అయితే ఆ అయిదు ట్రాన్సక్షన్ లతో కలిపి ఈ సైబర్ నేరగాళ్లు దాదాపుగా 3.82 లక్షలను దోచుకున్నారు.