అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇప్పటికే ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది.ధఢక్, గుంజన్ సక్సేనా సినిమాలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రెండు సినిమాలలో నటిస్తుంది.
దాంతో పాటు మరో కొత్త సినిమా కూడా సెట్స్ పైన ఉంది.ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ సౌత్ లో ఎంట్రీ కోసం కూడా మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది.
ఇదిలా ఉంటే అక్క బాటలోనే శ్రీదేవి రెండో కూతురు కూడా హీరోయిన్ గా కెరియర్ ప్లాన్ చేసుకుంటుంది.దానికోసం ఇప్పటికే అమెరికాలో నటనకి సంబందించిన మెళుకువలు నేర్చుకుంటుంది.
అలాగే లుక్స్, ఫిట్ నెస్ పరంగా కూడా కంప్లీట్ గా హీరోయిన్ ఫీచర్స్ ఉండే విధంగా తనని తాను మార్చుకునే పనిలో ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే బోనీ కపూర్ ఈ టీవీషోలో ఖుషీ కపూర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక ఆమెని హీరోయిన్ గా లాంచ్ చేసే బాధ్యతలని బోనీ కపూర్ తన భుజాలపై వేసుకున్నాడు.ఈ నేపధ్యంలో జాన్వీ కపూర్ మాదిరిగానే ఆమెని కూడా ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ చేతిలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఖుషీ కపూర్ ని బాలీవుడ్ లో కంటే సౌత్ లో ముందుగా పరిచయం చేస్తే బెటర్ అనే అభిప్రాయంతో బోనీ కపూర్ ఉన్నట్లు తెలుస్తుంది.ఓ స్టార్ హీరో సినిమా ద్వారా ఆమెని సౌత్ లో పరిచయం చేయాలని అనుకుంటున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఖుషీ కపూర్ ఎంట్రీ ఈ ఏడాది ఆరంభంలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.