ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న విషయం మనకు తెలియంది కాదు.ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేశంలోని పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు మరియు పోలీసులు నిరంతరాయంగా సేవలందిస్తూ శ్రమిస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ కి చెందినటువంటి స్వర్గీయ హీరోయిన్ శ్రీదేవి భర్త మరియు ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.
ఇందులో బోనీ కపూర్ ఇంట్లో పనిచేసేటువంటి ఓ యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వెంటనే వైద్యులు అప్రమత్తమై బోని కపూర్ ఇంట్లో పని చేస్తున్నటువంటి అందరి ఉద్యోగులను పిలిపించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అయితే ఇందులో కేవలం ఒక యువకుడికి మాత్రమే కరోనా వైరస్ సోకడంతో వెంటనే అతడిని దగ్గరలో ఉన్నటువంటి భవనానికి తరలించారు.అలాగే మిగిలిన వారిని కూడా కొంతకాలం పాటు సెల్ఫ్ క్వారేంటెన్ లో ఉండాలని సూచించారు.
అంతేగాక ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని మరియు ఇతరులతో మాట్లాడే సమయంలో కచ్చితంగా నోటికి మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా శానిటైజర్లతో కడుక్కోవాల ని తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బోని కపూర్ తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి వకీల్ సాబ్ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తో కలిసి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అలాగే హిందీలో కూడా బాధై హో అనే చిత్ర రీమేక్ కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.