టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో బోనీ కపూర్ గుస్సా అయిన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ని రాజమౌళి ఎనౌన్స్ చేశాడు.
అక్టోబర్ 13న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశాడు.అయితే అదే సమయంలో బాలీవుడ్ లో బోనీ కపూర్ నిర్మాతగా అజయ్ దేవగన్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న మైదాన్ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చేయడానికి ముందే డేట్ ఫిక్స్ చేశారు.
ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే.అలాగే రెండింటిలో కూడా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో బోనీ కపూర్ తన మైదాన్ సినిమాకి పోటీ రాకుండా చూడాలని రాజమౌళిని ముందే కోరాడు.అయితే రాజమౌళి మాత్రం మైదాన్ సినిమాని రిలీజ్ చేస్తున్నరెండు రోజుల ముందే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.
ఈ నిర్ణయం బోనీ కపూర్ కి కోపం తెప్పించింది.దీంతో బోనీ కపూర్ బాలీవుడ్ మీడియాలో నేరుగా రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమౌళి తనని మోసం చేశాడని ఆరోపించారు.
ఇక అంతటితో ఆగకుండా తన విమర్శలని బోనీ కపూర్ కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ సందర్భంగా తాను ఫోన్ చేస్తే రాజమౌళి సరిగా స్పందించలేదన్నాడు.బయ్యర్స్ ఒత్తిడితోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్టు రాజమౌళి ప్రకటించడం హాస్యస్పదంగా ఉందన్నారు.
మరోవైపు అప్పట్లో రాజమౌళి. బాహుబలి సినిమా విషయంలో శ్రీదేవి ప్రొఫెషనల్గా లేదని చెప్పిన వ్యాఖ్యలపై బోనీ కపూర్ స్పందించారు.
బాహుబలి సినిమాలో ముందుగా రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం శ్రీదేవి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసారని రాజమౌళి చెబుతున్న వ్యాఖ్యలను బోనీ కపూర్ ఖండించారు.రాజమౌళి ముంబాయికి వచ్చి శ్రీదేవికి స్టోరీ చెప్పారు.
ఆమె ఈ కథపై అంతగా ఆసక్తి చూపలేదు.నేను మాత్రం శ్రీదేవికి, మగధీర, ఈగ సినిమాలు చూపించి రాజమౌళితో సినిమా చేయమని చెప్పాను.
రాజమౌళి చెప్పిన నేరేషన్ విన్నాక శ్రీదేవి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు.అపుడే నాకు రాజమౌళి నుంచి ఓ మెసేజ్ వచ్చింది.
ఇచ్చిన ఇన్పుట్స్ తో ఆమెపై నాకు మరింత గౌరవం పెరిగిందన్నారు.ఇక ఆమె ఆఫర్ చేసిన పారితోషకం చాలా తక్కువ.
ఆమెకు అలాంటి ఆఫర్ చేయడం అంటే అవమానించడమే అని చెప్పాడు.ఆ తర్వాత రాజమౌళి గురించి మేము ఎక్కడా ప్రస్తావించలేదు.
కానీ ఇపుడు చూస్తుంటే రాజమౌళి దర్శకుడిగా అన్ఫ్రొఫెషనలీ అనిపిస్తోంది.సీనియర్లు అంటే ఆయనకు గౌరవం లేదనిపిస్తోంది అంటూ బోనీ కపూర్ ఘాటుగా రాజమౌళిపై విమర్శలు చేశారు.
అయితే బోనీ విమర్శలపై రాజమౌళి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా స్పందించకపోవడం విశేషం.