టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశాడు, గోవు మాంసం తినేవాళ్లు గోవుకు పూజ చేస్తే చేసిన పాపం పోతుందా అన్నాడు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నాడు.
నాకు తెలిసినప్పటి నుండి చరిత్రలో ఇన్ని ఎక్కువసార్లు ఆలయాలపై దాడులు జరగడం ఇదే మొటిసారని అన్నాడు.వైసీపీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవ చేశాడు.
విగ్రహాల ద్వంసం, ఆలయాలపై దాడులు చేయించి గోవుకు పూజలు చేసేది ఓట్ల కోసం కాదా అని ప్రశ్నించాడు.ఆలయాల పై దాడుల చేసిన నిందితులకు వైసీపీ సపోర్ట్ ఉందని తెలిపాడు.
గతం ప్రభుత్వంలో పార్టీలకు, మతాలకు అతీతంగా పనిచేసిన రాష్ట్ర పోలీసులు. ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించాడు.