మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ తనయుడుగా బన్నీ తర్వాత హీరోగా అల్లు శిరీష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.అయితే అతని కెరియర్ లో సినిమాలు సెలక్టివ్ గా చేసుకొని వస్తున్న అనుకున్న స్థాయిలో మిగిలిన మెగా హీరోలకి ఉన్నంత క్రేజ్ లేదు.
సింపిల్ కథలని అది కూడా తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే వాటిని సెలక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ వస్తున్న శిరీష్ తన అన్నలా డాన్స్, యాక్షన్, ఇరగదీసే రేంజ్ యాక్టింగ్ లేకపోవడంతో ఏదో హీరో అనిపించుకోవడానికి సినిమాలు చేస్తున్నాడు.నటుడుగా ఒకే అనిపించుకున్న శిరీష్ ని ఎలా అయిన మంచి హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఇప్పుడు అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా గీతా ఆర్ట్స్ మీదనే మంచి లవ్ స్టొరీలతో అతనికంటూ ఒక మార్కెట్ ఏర్పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే విజేత దర్శకుడు రాకేశ్ శశి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
దీని తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అదిరిపోయే రేంజ్ లో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం భాస్కర్ అఖిల్ హీరోగా తాను రూపొందిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం తెరకేక్కిస్తున్నాడు.
ఈ సినిమా మీద దర్శకుడుతో పాటు, హీరో అఖిల్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే భాస్కర్ తో శిరీష్ హీరోగా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నట్లు టాక్.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ లో జరుగుతున్నట్లు సమాచారం.