నాటు బాంబులు పేలి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని యంపీయూపీ పాఠశాల వద్ద బాంబులు పేలడంతో సమీపంలో ఉన్న ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు (12 ), రాజు (11 ) కు తీవ్ర గాయాలు అయ్యాయి.
వీరిద్దరిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.వీరిద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఇద్దరు విద్యార్థులు ఆడుకుంటుండగా ఆ సమీపంలో ఒక సంచి లాంటి వస్తువు దొరికింది.అందులో ఏముందో చూసేందుకు రాళ్లతో పగులగొట్టే ప్రయత్నం చేశారు.దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులు పేలాయి.ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.
అసలు అక్కడ ఆ బాంబులు ఎందుకు వచ్చాయి ? అక్కడ ఎందుకు పడేసారు అనే విషయంపైనా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.