హైదరాబాదులో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు.ముసారాంబాగ్ లో జాహీద్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలపై దాడులు, పేలుళ్లకు కుట్ర చేశాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.అంతేకాకుండా ఉగ్రవాద కార్యక్రమాల కోసం కొంతమంది యువకులను జహీర్ రిక్రూట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఉగ్రవాద సంస్థల కోసం ఇప్పటికే ఆరుగురు యువకులను జహీద్ రిక్రూట్మెంట్ చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.