వరుస బాంబు పేలుళ్ల తో సోమాలియా మరోసారి దద్దరిల్లింది.సోమాలియా రాజధాని మొగదీష్ నగరంలో ఈ వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
అధ్యక్ష భవనం సమీపంలోఒక బాంబు పేలుడు సంభవించగా,ఫోర్ట్ ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది.అయితే ఈ బాంబు పేలుళ్ల తో 14 మంది మృతి చెందగా,మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొలుత అధ్యక్ష భవనం దగ్గర పేలుడు జరిగిందని,ఆ తర్వాత ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం దగ్గర మరో పేలుడు సంభవించిందని తెలిపారు.అయితే ఈ బాంబు పేలుళ్లకు అల్ఖైదా ఉగ్రవాద అనుబంధ సంస్థ అల్షబాబ్ బాధ్యత వహిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ విధంగా సోమాలియా లో అల్ షబాబ్ సంస్థ బాంబు పేలుళ్లు జరపడం ఇదే తొలిసారి ఏమీ గతంలో పలుసార్లు ఈ విధంగా బాంబు పేలుళ్లకు పాల్పడింది.గత అక్టోబర్లో జరిగిన బాంబు పేలుడు లో 500 మంది చనిపోయారు.అయితే ఈ పేలుళ్ల లో అల్షబాబ్ హస్తముందని దర్యాప్తులో తేలింది.ఇప్పడు తాజాగా జరిగిన పేలుళ్ల తో 14 మంది మృతి చెందగా,26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.