జమ్మూ కాశ్మీర్ మరో సారి బాంబులతో దద్దరిల్లింది.జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా సిటీలో స్కూల్ భవనంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటుతో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.అంతలోనే స్కూల్ భవనంలో బాంబ్ బ్లాస్ట్ జరగడం అక్కడ సంచలనంగా మారింది.
బాంబు బ్లాస్ట్ గురించి తెలుసుకున్న భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకొని బ్లాస్టింగ్ కి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో వున్నారు.
ఇదిలా వుంటే ఈ బాంబ్ బ్లాస్ట్ లో స్కూల్ లో 12 మంది చిన్నారులు గాయాలకి గురి కావడంతో వారిని తక్షణం హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాంబు బ్లాస్ట్ తర్వాత పుల్వామాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలకి భద్రతా దళాలు సిద్ధం అయ్యాయి.అయితే స్కూల్ లో బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ ల కుట్ర లేక, ఉగ్రవాదుల సానుబూతిపరులు చేసిన పనా అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు భద్రతా దళాలు, స్థానిక పోలీసులు వున్నారు.