సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటన చేపట్టనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఉన్నట్టుండి.
భీమవరం ఉండి రోడ్డు లో బాంబు పేలింది.పేలుడు ధాటికి అదే ప్రాంతంలో ఉన్న ఒక ఆవు కి తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే ప్రాణనష్టం ఎక్కడా కూడా వాటిల్లలేదు.ఖాళీ స్థలంలో ఆవు మేతమేస్తూ ఉండగా.
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో.చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే సీఎం జగన్ పర్యటించే ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడంతో.పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో భీమవరంలో ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ పరిశీలించారు.అయితే పేలుడుకి గల కారణాలను గుర్తించడానికి విజయవాడ నుండి ప్రత్యేకమైన బృందం వస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో పక్కనే ఉన్న స్క్రాప్ యాడ్ లో పాత ఫ్రిడ్జ్ లు.వాషింగ్ మెషిన్ లు పగలగొట్టి ఉండటంతోపాటు.అమ్మోనియం కెమికల్ మెటీరియల్ బాంబ్ లో ఉన్నట్లు ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో పేలుడు ఎలా జరిగింది.? పేలుడుకి గల కారణాలు ఏమిటి.? అనే దాని గుర్తించడానికి విజయవాడ నుండి ప్రత్యేకమైన బృందం వచ్చాక తెలుస్తుందని స్పష్టం చేశారు.