ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమలో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందిన నటి మాధురి దీక్షిత్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈమె తన అందం, అభినయం, నటనతో ఒక బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, ఇలా భాషతో సంబంధం లేకుండా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.
అప్పట్లో తనకు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి స్వర్గీయ నటి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో అప్పట్లో తాను మరియు శ్రీదేవి సినీ పరిశ్రమలో పోటీపడినటించిన మాట వాస్తవమే అయినప్పటికీ తమ మధ్య ఎప్పుడూ కూడా వ్యక్తిగత పోటీ లేదని కేవలం తాము పని పరంగా మాత్రమే పోటీ పడ్డామని చెప్పుకొచ్చింది.
కానీ నటి శ్రీదేవి నటించిన చిత్రాలు మరియు నటించే తీరు వంటి వాటిలో తన కంటే ఎన్నో రెట్లు ముందు ఉందని వ్యాఖ్యానించింది.అలాగే తమ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని కూడా తెలిపింది.
అయితే కొంత మంది అభిమానులు తమ అభిమాన నటీనటులపై ఉన్నటువంటి అభిమానం కారణంగా ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారని కానీ తాము మాత్రం ఎప్పుడు అలాంటి చర్చలకు తావు ఇవ్వలేదని తెలిపింది.అలాగే తాము రేసు గుర్రాలు కాదని కూడా ఉదాహరణగా వ్యాఖ్యానించింది.
అయితే ఈ విషయంలో ఉండగా గతంలో చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమకు 2019 సంవత్సరంలో విడుదలైనటువంటి కళంక్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.వచ్చి రావడంతోనే మాధురి దీక్షిత్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
మరోపక్క పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.