సుశాంత్ మరణంతో అజ్ఞాతంలోకి వెళ్లిన దర్శకుడు...

ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిడులను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో మధ్య సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన పలు విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

 Karan Johar, Bollywood Top Producer, Sushant Singh Rajput Death, Bollywood News-TeluguStop.com

అయితే ఇందులో ఎక్కువగా బాలీవుడ్లో పలు భారీ బడ్జెట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ పరోక్షంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం అయ్యాడని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొందరు నిందిస్తున్నారు.అంతేగాక కరణ్ జోహార్ గురించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కామెంట్లు, ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

దీంతో కరణ్ జోహార్ ఈ సూటిపోటి మాటలు మరియు నెటిజన్ల కామెంట్లను తట్టుకోలేక కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లి పోవాలని నిర్ణయించుకొని ప్రస్తుతం ఎవరిని కలిసేందుకు ఇష్టపడడం లేదట.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరణ్ జోహార్ తెలుగులోప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

మరి కరణ్ జోహార్ ఉన్నట్లుండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రాల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరి ఈ విషయానికి కరణ్ జోహార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube