కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయిపోయాయి.మరోవైపు ఈ కరోనా ప్రభావం కచ్చితంగా ఓ ఐదేళ్ళ పాటు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సామాజిక దూరం పాటించడమే కరోనా నియంత్రణకి ఉన్న ఒకే ఒక్క అవకాశం అని తేల్చేస్తున్నారు.ఇలాంటి వేళ సామాజిక దూరం ప్రభావం సినిమాలలో కథలపై పడే అవకాశం ఉంది అనిపిస్తుంది.
ఈ అనుమానమే ఓ బాలీవుడ్ దర్శకుడుకి కూడా వచ్చింది.పాత సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు, ఇంటిమేట్, ముద్దు సీన్లు పెట్టాల్సి వస్తే వాటికి రిప్రజెంట్ గా పువ్వులు, ఆకాశంలో దృశ్యాలు చూపించే వారు.
అయితే ఇప్పుడు అన్ని హద్దులు చెరిగిపోయి హీరోయిన్స్ ఇలాంటి సన్నివేశాలు చేయడానికి అభ్యంతరం పెట్టకపోవడంతో నేరుగానే లిప్ లాక్ వంటి సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సన్నివేశాలు కూడా హీరో, హీరోయిన్స్ మధ్య పెడుతున్నారు.బాలీవుడ్ లో అయితే ఇవి ప్రతి సినిమాలో కామన్ గా ఉంటాయి.
సామాజిక దూరం తప్పనిసరి అంటే ఇప్పుడు ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల కోసం ఏం చేయాలి అనే డౌట్ విక్కీ డోనర్, మదరాస్ కేఫ్, పీకు చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సూజిత్ సర్కార్కి వచ్చింది. హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించాలి.
దూరంగానే ఉంచి షూట్ చేసి ఆ తరువాత దగ్గరగా ఉన్నట్లు చూపించాల్సి వస్తుందేమో.మోసం చేసి అయినా కథలు చెప్పాలి కదా అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు స్పందించిన దియా మిర్జా సినిమా షూటింగ్ అంటేనే కొన్ని వేల మంది దగ్గరగా ఉండి పని చేయాల్సి వుంటుంది.భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది అని ట్వీట్ చేసింది.
మరి కొంత మంది మళ్లీ పాత సినిమాల్లో లాగా ముద్దు సీన్లు వచ్చినప్పుడు రెండు పువ్వులు చూపించడమే అని ట్వీట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ దర్శకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, అందరూ రకరకాల డౌట్ లు రైజ్ చేస్తున్నారు.