సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలం నుంచి డ్రగ్ మాఫియా తీవ్ర కలకలం రేపుతోంది.ఈ క్రమంలోనే ఈ డ్రగ్ మాఫియా కేసు ఎంతో మంది సెలబ్రిటీలు మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్లు దర్శకులను విచారణ చేపట్టారు.తెలుగులో కన్నా ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా తీవ్ర సంచలనం సృష్టించింది.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అధికారులు ప్రతి ఒక్కరిని ఈ కేసు గురించి ఆరా తీస్తున్నారు.ఈ డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం.
డ్రగ్ మాఫియా అంటే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని రంగాలలో తీవ్ర సంచలనం రేపుతోంది.
ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు ముంబైలోని ఒక పెద్ద క్రూయిజ్ షిప్లో సోదాలు నిర్వహించింది.ఈ క్రూయిజ్లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ముంబైలోని సముద్రంలో కార్డెలియా క్రూయిజర్ లో పార్టీ జరిగింది.ఈ పార్టీ కి ముంబైలోని కోటిశ్వరలు,సెలబ్రెటీ హాజరయ్యారు.
ఆ పార్టీ లో భాగంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడినట్లు అధికారులకు సమాచారం రావడంతో ఈ క్రూయిజర్ పై దాడులు చేశారు.
ఈ దాడులలో భాగంగా అధికారులు పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను చోటుచేసుకున్నట్లు తెలియజేశారు.అయితే ఇందులో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే ఈ కేసులో భాగంగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ పార్టీలోకి వచ్చిన చాలా మంది ఎక్కువగా ఢిల్లీ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ లు వచ్చారని వీరిలో చాలా మంది డ్రగ్స్ సేవించారని పోలీసులు ఈ క్రమంలోనే ఈ ఆపరేషన్లో భాగంగా అధికారులు పెద్ద మొత్తంలో కొకైన్, డ్రగ్స్, MD డ్రగ్లను స్వాధీనం చేసుకుంది.ఈ ఆపరేషన్లో చాలా మందిని అరెస్టు చేశారు.
పూర్తి ఈ వివరాలను త్వరలోనే తెలియజేయుననట్లు అధికారులకు తెలిపారు.