దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి.
పెరుగుతున్న కరోనా కేసులు టాలీవుడ్ ఇండస్ట్రీని భయపెడుతున్నాయి.అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడ్డారు.
స్టార్ హీరోయిన్ అలియా భట్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం అలియా భట్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.డాక్టర్ల సలహాలు, సూచనల ప్రకారం అలియా భట్ మందులు, ఆహారం తీసుకుంటున్నారు.అలియా భట్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న వాళ్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలియా భట్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు సూచించారు.
ప్రస్తుతం గంగూబాయి కతియావాడీ షూటింగ్ లో అలియా భట్ పాల్గొంటున్నారు.
అలియా భట్ కు కరోనా నిర్ధారణ కావడంతో అ ప్రభావం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై పడే అవకాశం ఉంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, హీరో చరణ్ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైందో లేదో తెలియాల్సి ఉంది.అలియా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యమైతే ఆ ప్రభావం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై పడే అవకాశాలు ఉన్నాయి.
2021 సంవత్సరంలో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ దాదాపు 900 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.దసరా పండుగకు సోలోగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.అలియా భట్ కు కరోనా సోకడంతో ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉందని చిత్రయూనిట్ తో పాటు స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.