ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్ మరో రెండు నెలల్లో పట్టాలెక్కబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు ఓం రౌత్ ఉన్నాడు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతుంది అంటూ సమాచారం అందుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా విలన్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషంచబోతున్నాడు.
ఆ విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఇక కీలక పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పోషించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అజయ్ దేవగన్ ఆదిపురుష్ లో నటించడం లేదు.ఆ విషయాన్ని స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు.
తాను ఆదిపురుష్లో నటించడం లేదు అంటూ అజయ్ దేవగన్ ప్రకటించాడు.ఆయన నటించడం లేదు అంటూ క్లారిటీ వచ్చిన వెంటనే ఆయన కాదు ఆయన భార్య కాజోల్ ఈ సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
కాజోల్ ఈమద్య కాలంలో సినిమాలు తగ్గించింది. భారీ బడ్జెట్ సినిమా అవ్వడంతో పాటు కీలక పాత్రను ఆఫర్ చేయడం వల్ల కాజోల్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.
బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో అంటే మండోదరి పాత్రలో కాజోల్ కనిపించే అవకాశం ఉంది అంటున్నారు.రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల చిన్న పాత్ర అయినా కూడా నటించేందుకు ప్రతి ఒక్కరు సిద్దంగా ఉన్నారు.
అలాగే కాజోల్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది.ఇక ప్రభాస్కు జోడీగా సీత పాత్రలో నటించబోతున్న నటి ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేవలం ఆరు నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసి ఈ సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఓం రౌత్ వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుంది.
ప్రభాస్ కు 75 కోట్ల పారితోషికం మరియు లాభాల్లో వాటను ఇస్తున్నారట.కాజోల్ కు కూడా 10 కోట్ల పారితోషికంను మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది.