సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హెల్త్ ఇష్యుస్ వల్ల ఈమె ఇండియాలోనే బాగా పాపులర్ అయ్యింది.
విడాకులు తర్వాత పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసి పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టింది.
వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్న సమయంలోనే ఈమె అనారోగ్యం పాలు అయ్యింది.దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది.
ఈమె అనారోగ్యానికి గురి అయినప్పటి నుండే ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోయాయి.ఈమెకు హెల్త్ ఇష్యు వచ్చింది అని ఎవరు కూడా దయ చూపించకుండా ఈమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
సామ్ అనారోగ్యాన్ని వేలెత్తి చూపిస్తూ ఆమెను మరింత వేదనకు గురి చేస్తున్నారు.తాజాగా సమంత అందం మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈమె హెల్త్ ఇష్యు నుండి అజేయమైన పోరాటం తర్వాత మళ్ళీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది.ఈ క్రమంలోనే సామ్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.ఈమె మునుపటి విధంగా అందంగా లేదని.గ్లో కోల్పోయింది అని రాసారు.ఇలా ట్రోల్ చేసే వారికీ సామ్ గట్టిగానే జవాబు చెప్పింది.ఇక ఇప్పుడు ఈమెకు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా మద్దతుగా నిలిచాడు.
”క్లిక్ బెయిట్ ల గురించి కొంత మంది మాత్రమే ఆలోచిస్తారని అలా నెగిటివ్ గా రాసే వారి పట్ల తనకు బాధగా ఉందని.ఈ ట్రోలర్లకు గ్లో అవసరం అయితే ఇన్ స్టాగ్రామ్ ఫిలీటర్ల కోసం వెతకాలని” వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు.ఇక ప్రెజెంట్ సమంత ‘శాకుంతలం’ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.చారిత్రక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023న థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది.