అక్టోబర్ 2వ తారీకున ముంబయి గోవా క్రూజ్ నౌకలో జరుగుతున్న ఒక పార్టీ లో ఎన్ సీ బీ అధికారులకు పట్టుబడ్డ బాలీవుడ్ కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.డ్రగ్స్ ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ వద్ద లేకున్నా కూడా అతడికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లుగా పలు ఆధారాలు లభించాయి.
అతడి స్నేహితుడి వద్ద డ్రగ్స్ లభించడంతో పాటు.అతడి వాట్సప్ చాట్ లో కూడా డ్రగ్స్ గురించిన ప్రస్థావన ఉంది.
అందుకే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రావడం లేట్ అయ్యింది.ఎన్ సీ బీ అధికారులు సుదీర్ఘం విచారించిన తర్వాత ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసేందుకు కాస్త ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అందుకే ముంబయి హై కోర్టు ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
గత మూడు వారాలుగా జైలుకే పరిమితం అయిన ఆర్యన్ ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.షారుఖ్ ఖాన్ జైలుకు వెళ్లి ఒక సారి కొడుకును చూసి వచ్చాడు.ఆ తర్వాత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.
అయినా కూడా బెయిల్ మంజూరు అవ్వడం లో జాప్యం జరిగింది.బెయిల్ మంజూరు కోసం చాలా ప్రయత్నాలు చేసిన ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ మూడు నాలు సార్లు పిటీషన్ వేయడం జరిగింది.
ఎట్టకేలకు ఆయన ఈ సారి బెయిల్ ను సాధించాడు.ఆర్యన్ బెయిల్ పై విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో షారుఖ్ నివాసం అయిన మన్నాత్ లో ఆనందం కనిపించబోతుంది.
గత మూడు వారాలుగా మన్నాత్ లో కనీసం స్వీట్లు కూడా వండటానికి వీలు లేదు అంటూ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అన్నారట.ఆర్యన్ ఖాన్ హీరోగా పరిచయం అవ్వాలనుకున్న సమయంలో ఈ వ్యవహారం జరగడంతో ఆయన ప్లాన్స్ లో ఏమైనా మార్పు వస్తుందా అనేది చూడాలి.