బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas )హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్( Adipurush ).ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.మరొకవైపు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సినిమా విడుదల సందర్భంగా అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా చర్చనే నడుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) ఆశ్యర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు.ఆదిపురుష్ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్ విడివిడిగా 10 వేల వరకు టికెట్లు కొన్నారు.వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా నెటిజన్స్ వామ్మో ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించారు.మొత్తానికి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ రాబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మూవీ మేకర్స్.