అయ్యప్ప దీక్షను మన సౌత్ లో చాలా నిష్ఠగా చేస్తూ ఉంటాం.ఈ దీక్షకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం.
ఇది వరకు కంటే ఇప్పుడు మన సౌత్ లో అయ్యప్ప దీక్షను చేపట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.మన సౌత్ లో సెలెబ్రిటీలు సైతం అయ్యప్ప దీక్షను ఎంతో నిష్ఠగా చేస్తూ ఉంటారు.
ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు అయ్యప్ప మాలను వేసుకుని 41 రోజులు నిష్ఠగా పూజించారు.
ఈ ఏడాది మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాల వేసుకున్న విషయం తెలిసిందే.
మన సౌత్ లో ఉన్న ప్రజలకు, స్లేబ్రిటీలకు అయ్యప్ప మాల అనేది మాములుగా విషయమే.ఎందుకంటే ఎప్పుడు మాములు ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా వేసుకుంటూ ఉంటారు.
అయ్యప్ప ను ప్రసన్నం చేసుకోవడానికి 41 రోజుల పాటు చేపట్టే దీక్షను చివరిగా కేరళలో ఉన్న శబరిమల దేవస్థానంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత ఆ దీక్షను ముగిస్తారు.ఇలా అయ్యప్ప మాల వేసుకుని నిష్ఠగా పూజిస్తే ఆయన కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం.
ఇప్పటి వరకు అయ్యప్ప దీక్ష సౌత్ కు మాత్రమే పరిమితం అయ్యింది.అయితే తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో సైతం అయ్యప్ప మహిమ కనిపిస్తుంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అయ్యప్ప మాల వేసుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా అయ్యప్ప మాల వేసుకుని అందరికి ఆశ్చర్యం కలిగించారు.అజయ్ దేవగన్ అయ్యప్ప మాలను ధరించడానికి మన సౌత్ జ్యోతిష్యుడు బాలు మున్నంగి కారణం కాగా.గురుస్వామి వెంకటరెడ్డి అనే ఆయన స్వయంగా ముంబై వెళ్లి అక్కడ ఉన్న అజయ్ దేవగన్ ఇంట్లో అయ్యప్ప మాలధారణను వేయించడం విశేషం.
ఇప్పటి వరకు బాలీవుడ్ లో అయ్యప్ప మాల వేసిన మొట్టమొదటి స్టార్ హీరో అజయ్ దేవగన్ అయ్యి ఉండవచ్చు.అజయ్ దేవగన్ అయ్యప్ప మాల వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.