బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది.
ఆ తర్వాత క్రమక్రమంగా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.అంతేకాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులను కొంతకాలంపాటూ తాత్కాలికంగా నిలిపి వేశారు.దీంతో పరిణితి చోప్రా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే పరిణితి చోప్రా బీచ్ లో బికినీ దుస్తులు ధరించి ఇసుక తిన్నెలపై కూర్చున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ అమ్మడు హాట్ ఫోటో షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 7 లక్షల పైచిలుకు మంది లైకులు, కామెంట్లు చేశారు అంతేకాకుండా ఈ ఫోటోపై బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందిస్తూ పరిణితి చోప్రా ని చూస్తుంటే తనకు చాలా జలసీగా ఉందని కామెంట్ చేసింది.
కాగా ఇటీవలే పరిణితి చోప్రా సైనా అనే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.ఈ చిత్రం భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కించారు.దీంతో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.కాగా ప్రస్తుతం పరిణితి చోప్రా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.