బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “కంగనా రనౌత్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ మధ్య పలు ఈ విషయాలపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
కాగా ఇటీవలే తమిళ ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే విషయం ఏమిటంటే ఇటీవలే కమల్ హాసన్ తమ రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీ అధికారంలోకి వస్తే గృహిణిల పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామంటూ తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా కమల్ హాసన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ఇందులో భాగంగా కుటుంబంలోని గృహిణి తన కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకుంటూ వారికి సేవలను చేస్తుందని అలాంటి వారికి వేతనం ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది.
అంతేగాక ప్రతి మహిళ మాతృమూర్తి అవ్వడంతోనే తమ జీవితం సార్ధకం అవుతుందని అలాంటిది తానూ గర్భం దాల్చేందుకు తన భర్తతో శృంగారంలో పాల్గొనడానికి కూడా ఖరీదు కట్టగలరా.? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
అంతేకాక మహిళలు చేస్తున్నటువంటి పనులకి ప్రత్యేకంగా డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదని కేవలం వారికి కావలసినటువంటి ప్రేమ, గౌరవం, మమతానురాగాలు వంటి వాటికి లోటు రాకుండా చూసుకుంటే చాలని తెలిపింది. దీంతో కంగనా రనౌత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కొంతమంది నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.అంతేగాక మహిళలు ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ లోటూ రాకుండా చూసుకుంటారని అలాంటి వారి ప్రేమని డబ్బుతో ఖరీదు కట్టడం సరికాదని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ ఓ తమిళంలో "తలైవి" అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరియు స్వర్గీయ హీరోయిన్ జయలలిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది.దాంతో ఈ చిత్రంలో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగాపూర్తయినట్లు సమాచారం.