మామూలుగా సినిమా పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఒక్క ఛాన్స్ దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతగానో పరితపిస్తుంటారు.అయితే ఇందులో కొందరు నటీనటులు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటారు.
ఈ క్రమంలో కొంతమంది అప్పుడప్పుడు కొంత మేర బోర్డ్ తరహా పాత్రల్లో కూడా నటించాల్సి ఉంటుంది.అయితే బోల్డ్ తరహా పాత్రలో నటించడానికి హీరోలకు అయితే ఓకే గాని హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత పలు సమస్యలు ఎదురవుతాయని అంటూ బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగంగా తాను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో నటించినటువంటి కొన్ని చిత్రాలు పాత్రలు బోల్డ్ గా ఉండడంతో తన పిల్లలు ప్రస్తుతం వాటిని చూసి కొంతమేర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చింది.అంతేగా బోల్డ్ తరహాలో చేసినటువంటి ఫోటో షూట్లు వీడియోలు కొందరు అశ్లీల వెబ్ సైట్లలో ప్రచురించడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతేకాక ఒకానొక సమయంలో తన కొడుకు తనని తన చిత్రాలు చూసే ముందు అమ్మ నీ చిత్రాలలో రొమాంటిక్ సీన్లు ఉంటాయా.? అంటూ అడిగి మరీ తెలుసుకొని అలాంటి సన్నివేశాలు లేని చిత్రాలను చూస్తాడని తెలిపింది. దాంతో తాను ఒకానొక సమయంలో చేసినటువంటి సినిమాల వల్ల తన పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విషయాన్ని గమనించానని కాబట్టి ఇకపై అలాంటి పాత్రలో నటించే ముందు కొంత మేర ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జుహీ చావ్లా బాలీవుడ్ లో “శర్మాజీ నామకీన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
అంతేగాక పలు బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.