మళ్ళీ కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరోయిన్...

ఇటీవలే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన సంగతి అందరికీ తెలిసిందే.దాంతో ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ముంబై నగరంలో ఉన్నటువంటి ప్రముఖ నానావతి ఆసుపత్రి వైద్యుల సమక్షంలో క్వారంటైన్ లో ఉంటున్నారు.

 Aishwarya Rai Bachchan, Bollywood Star Actress, Corona Virus Positive In Second-TeluguStop.com

ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్య మాత్రం ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

అయితే తాజాగా వైద్యులు మరోమారు ఐశ్వర్య రాయ్ కి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రెండవ సారి కూడా పాజిటివ్ వచ్చింది.

దాంతో ఐశ్వర్యరాయ్ కూడా నానావతి ఆసుపత్రిలో చేరినట్లు ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. దీంతో ఆమె అభిమానులు కొంతమేర ఆందోళనకు గురవుతున్నారు. అంతేగాక ఆమె తొందరగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని ప్రార్థనలు, పూజలు చేయడం మొదలు పెట్టారు.కాగా ఆరాధ్య మాత్రం ఇప్పటికీ ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమని కరోనా వైరస్ తీవ్రంగా వెంటాడుతోంది.ఇటీవల ఈ కరోనా వైరస్ బారినపడి ఓ ప్రముఖ సింగర్మరియు సీనియర్ నటుడు మరో ప్రముఖ సినీ రచయిత, తదితరులు మరణించారు.

దీంతో సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ప్రజలను కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండాలని అంతేకాక భౌతిక దూరం పాటిస్తూ చేతులను నిరంతరం శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube