బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో 2016 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి మరియు స్టార్ హీరో అమీర్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కిన “దంగల్” చిత్రం సిటీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ “ఫాతిమా సనా షేక్” తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.కాగా ఇటీవలే ఫాతిమా సనా షేక్ ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేసింది.
అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎవరూ తెలియక పోవడంతో అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.అంతేకాక అవకాశాల కోసం ప్రతిరోజు ఏదో ఒక సినిమా ఆఫీసు చుట్టూ తిరిగేదాన్ననని దాంతో కొంతమంది పడక గది కమిట్మెంట్ ఇస్తే సినిమా అవకాశాలు ఇస్తామంటూ లొంగ తీసుకోవాలని చూసినట్లు చెప్పుకొచ్చింది.
అంతేకాక కమిట్మెంట్ ఇస్తే డబ్బుతో పాటు మరిన్ని సినిమా ఆఫర్లు కూడా ఇస్తామని చెప్పినప్పటికీ తాను మాత్రం అసలు అంగీకరించలేదని తెలిపింది.అలాగే మనలో ప్రతిభ ఉంటే కచ్చితంగా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని అంతేగాని మనలో ప్రతిభ లేకపోతే అడ్డదారుల్లో అవకాశాలు సంపాదించినా పెద్దగా ఉపయోగం ఉండదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది ఈ అమ్మడు “లూడో” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.కాగా ఇటీవలే బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించిన “అజీబ్ దాస్తాన్స్” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.