ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు నటీనటులు ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ని ఉపయోగించుకొని బాగానే పాపులర్ అవుతున్నారు.అయితే ఈ మధ్య మోడలింగ్ రంగంలో ముంబైకి చెందిన పట్టుమని పాతికేళ్ల కూడా నిండనటువంటి సాక్షి మాలిక్ అనే మోడల్ బాగానే రాణిస్తోంది.
అయితే ఈ అమ్మడు తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ప్రముఖ ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ లో పాల్గొని స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో దిగినటువంటి ఫోటోలని షేర్ చేసింది.దీంతో ఈ అమ్మడి ఫోటోలను చూసి కొంతమంది అభిమానులు “మేడం సార్ మేడమ్” అంటూ డైలాగులను వల్లిస్తున్నారు.
మరి కొంతమంది అయితే ఏకంగా ఈ కరోనా టైంలో కూడా కుర్రకారు గుండెల్లో వేగం పెంచుతోందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఫోటో ని సాక్షి మాలిక్ షేర్ చేసిన 9 గంటల లోపే దాదాపుగా 2 లక్షల 70 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో సాక్షి మాలిక్ కి ఉన్నటువంటి క్రేజ్ గురించి. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి ఇంస్టాగ్రామ్ ఖాతాను దాపు 52 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి “వి” చిత్రంలోని ఓ సన్నివేశంలో సాక్షి మాలిక్ పేరు వినబడడంతో ఆమె గురించి నెటిజన్లు గూగుల్ లో బాగానే సర్చ్ చేస్తున్నారట.అంతేగాక సాక్షి మాలిక్ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.