మంచి స్పీడ్ తో బాలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే మిషన్ మంగళయాన్ చిత్రం తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్షయ్ ఆ తరువాత హౌస్ ఫుల్-4,గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీబాంబ్, బచ్చన్ పాండే, ఇక్కా వంటి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ లో కూడా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ బయోపిక్ ఎవరిపైన అని అనుకుంటున్నారా.
ఆయనే భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.అజిత్ దోవల్ జీవిత చరిత్ర ఆధారం గా ఒక బయోపిక్ ని తెరకెక్కించనున్నారు.
అయితే ఈ చిత్రంలో నటించడానికి అక్షయ్ ని సంప్రదించగా దానికి అక్షయ్ కూడా ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోపక్క దోవల్ బయోపిక్ గురించి మాట్లాడాలి అంటే ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా భాద్యతలు చేపట్టి ఆతరువాత సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించడం, అలానే దేశ భద్రతకు సంబంధించి కూడా ఆయన అనేక అంశాల్లో కీలకంగా వ్యవహరించారు అన్న విషయం కూడా తెలిసిందే.
మరోపక్క ఆయనకు సైనిక విభాగంలో అత్యున్నత పురస్కారమైన కీర్తి చక్ర అవార్డు కూడా దక్కింది.అయితే ఆయన జీవిత కథను తెరకెక్కించాలి అని, గతంలో అక్షయ్ హీరోగా స్పెషల్ 26, టాయిలెట్ ఏక్ ప్రేమ్కథ సినిమాను రూపొందించిన నీరజ్ పాండే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బాలీవుడ్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు సంబంధించి తీసుకున్న అర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నిర్ణయాల అమలులోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో అక్షయ్ కూడా దోవల్ బయోపిక్ లో నటించాలని చాలా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది.అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు కానీ,త్వరలో అజిత్ దోవల్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్నట్లు అర్ధం అవుతుంది.