తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “చిరుత” అనే చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్ తేజ్” అలాగే బాలీవుడ్ బ్యూటీ “నేహా శర్మ” ఇద్దరూ జంటగా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరో, హీరోయిన్లుగా పరిచయం అయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంటే నేహ శర్మ మాత్రం హీరోయిన్ గా తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
దీనికి తోడు ఈ మధ్యకాలంలో నేహ శర్మ నటించిన చిత్రాలు కొంతమేర బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో నేహా శర్మ కొత్త సినిమా అవకాశాలను తగ్గించుకోవడంలో విఫలం అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా హీరోయిన్ ఆశీషా శర్మ కూడా బాలీవుడ్ లో హీరోయిన్ అని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అయితే ఆశీషా శర్మ హీరోయిన్ గానే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా కొంత కాలం పాటు పని చేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించినటువంటి “సత్యమేవ జయతే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించడంతో ఇటీవలే ఈ అమ్మడు ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం ఆశీషా శర్మ పలు ప్రముఖ ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొని తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో హీట్ పెంచేస్తోంది.
ప్రస్తుతం నేహా శర్మ “ఇల్లీగల్” అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
అలాగే బాలీ వుడ్ లో ప్రముఖ దర్శకుడు “బిజోయ్ నంబియార్” దర్శకత్వం వహిస్తున్న “టైస్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.