బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ నటించినటువంటి తలైవి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవిత కథ ఆధారంగా తెరకేక్కిన తలైవి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ నటించారు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం గురించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సినిమా విషయంలో తనకు సంబంధం లేకుండా తమ సంస్థకు చెందిన వారు తన సొంత సంస్థ ద్వారా ఈ సినిమాకు భారీగా నిధులు తరలించారని విబ్రి మీడియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కార్తిక్ క్రష్ణన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా జూబ్లీహిల్స్ లోని యాక్సిస్ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా మరో ఇద్దరు పార్ట్నర్స్ అయినటువంటి విష్ణువర్ధన్, బింద్రా ప్రసాద్ లు తమ సొంత సంస్థకు నిధులు మళ్లించినట్లు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి నెలలో సుమారు 75 లక్షలు విబ్రి మోషన్ పిక్చర్స్ అనే సొంత సంస్థకు రెండు సార్లు ఆన్ లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు కార్తిక్ క్రిష్ణన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.సివిల్ అంశాలు ఉండడం చేత ఈ విషయం పోలీసులకు ఎంతవరకు సంబంధం అనే విషయం గురించి వీరు సలహాలు సూచనల కోసం న్యాయవాదులను సంప్రదించి నట్టు తెలుస్తోంది.ఈ విషయం గురించి న్యాయవాదులు సలహాలు సూచనలు విన్న తర్వాత ఈ కేసుపై విచారణ కొనసాగునున్నట్టు పోలీసులు తెలిపారు.