తెలుగులో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి “లోఫర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న ఈ సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా ఈ కరోనా వైరస్ దిశా పటాని ఇంట్లో కూడా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే తాజాగా దిశా పటాని తండ్రి జగదీష్ పటాని కి కరోనా వైరస్ సోకి చికిత్స నిమిత్తమై ఆసుపత్రిలో చేరినట్లు దిశా పటాని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు.
అలాగే జగదీష్ పటానికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వెంటనే తన కుటుంబ సభ్యులు మరియు తన ఇంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు.అనంతరం జగదీష్ పటాని ని స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించి స్పెషల్ ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.
అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం దిశాపటాని “రాధే” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తుండగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో టాలీవుడ్ బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.కాగా ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.