టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం తెలుగు, హిందీ ప్రేక్షకులందరికీ తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక తన అందంతో ఎంతో మంది అభిమానుల మనసులను దోచుకుంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.
కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రకుల్ ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి బాలీవుడ్ స్టార్ హీరో ఓ గిఫ్ట్ పంపాడు.
ప్రస్తుతం బాలీవుడ్ లో థాంక్ గాడ్, మే డే, డాక్టర్ జి అనే సినిమాలలో బిజీగా ఉన్న రకుల్ పలు అవకాశాలు కూడా అందుకుంది.
ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్న సినిమాలో అవకాశం అందుకోగా ఆ సినిమాకు డైరెక్టర్ రంజిత్ తివారి దర్శకత్వం వహించనున్నాడు.ప్రస్తుతం కోవిడ్ టెస్టులు నిర్వహించిన రెండు, మూడు రోజుల వరకు ఫలితాలు వచ్చేవి.కానీ తాజాగా కరోనా టెస్టింగ్ కిట్స్ తో ఇంట్లోనే ఉంటూ కరోనా టెస్టింగ్ ను చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్టాఫ్ తో కలిసి ఇండస్ట్రీలో చాలామందికి ఈ టెస్టింగ్ కిట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇక రకుల్ ప్రీతిసింగ్ కూడా ఈ టెస్టింగ్ కిట్ గిఫ్ట్ గా ఇవ్వగా రకుల్ ఆ కిట్ ను ఫోటో తీసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అక్షయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపింది.