బాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అక్షయ్ కుమార్.ఈయన ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ వందల కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెడుతున్నాడు.40 నుండి 60 కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడం దాంతో భారీగా లాభాలను దక్కించుకోవడం ఈయనకు అలవాటుగా మారిపోయింది.ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ కూడా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ను ఇండియాలో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రెటీ జాబితాలో నెం.1 లో ఉంచడం జరిగింది.ఆయన సంపాదన విషయంలో ఇతర ఏ హీరోలు కూడా నిలవలేదు.
హాలీవుడ్ స్టార్స్ రేంజ్ లో సినిమాలతో ఆయన సంపాదిస్తున్నాడు అంటూ ఫోర్బ్స్ పేర్కొంది.భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా సింపుల్గా చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తూ తన పారితోషికం విషయంలో మాత్రం రాజీ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.40 నుండి 80 కోట్ల వరకు పారితోషికంను ఈయన తీసుకుంటూ ఉన్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.బాలీవుడ్ లో ప్రస్తుతం నెం.1 హీరో అయిన అక్షయ్ తన ఆరోగ్య రహస్యంగా చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.
ఒక ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.
తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతాను.అందువల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆయన సూచిస్తున్నాడు.
ఆయుర్వేదిక్ ఔషదంగా ఆవు మూత్రం బాగా పని చేస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.అనేక అనారోగ్య సమస్యలకు ఆవు మూత్రం చాలా బాగా పని చేస్తుందన్నాడు.
ఆవు మూత్రమే కాకుండా ఏనుగు పాప్ టీని కూడా అక్షయ్ కుమార్ తాగుతాను అంటూ ఆ షోలో చెప్పడం జరిగింది.ఏనుగు వ్యర్థాల నుండి తయారు చేసిన పాప్ టీ చూడ్డానికి వినడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించినా కూడా అది మంచి ఆరోగ్యదాయిని అంటూ అక్షయ్ పేర్కొన్నాడు.
ఇలాంటి ప్రకృతి సిద్దమైన ఔషదాలను తీసుకుంటూ ఉండటం వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నాడట.ఇది పూర్వ కాలం నుండి ఉన్నవే.
అప్పట్లో జనాలు అంద దృడంగా బలంగా ఉండటంతో పాటు ఎక్కువ ఏళ్లు బతికారు.కనుక అక్షయ్ కుమార్ కూడా మంచి ఆరోగ్యంతో మంచి అందంతో చాలా కాలం పాటు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.