శుక్రవారం వచ్చింది అంటే బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.అయితే మన సౌత్ లో ఇప్పుడు కనిపిస్తున్న సినిమా సందడి నార్త్ లో కనిపించడం లేదు.
ఇది వరకు లాగా అక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం లేదు.థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం లేదు.
అసలు బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.
అందుకే మన సౌత్ ఇండియా కంటే బాలీవుడ్ ఈ మధ్యన వెనుకబడి పోయింది.
అలా అని అక్కడి ప్రేక్షకులు సినిమాలు చూడడం మానేశారు అని అనుకోకండి.ఉత్తరాది ప్రేక్షకులు మన సినిమాలను వదలకుండా చూస్తున్నారు.
కానీ వీరి సినిమాలను మాత్రం అస్సలు పట్టించుకోవడమే లేదు.కరోనా తర్వాత బాలీవుడ్ ఇప్పటికి కోలుకోలేక పోతుంది.
అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు.
ఇప్పట్లో బాలీవుడ్ కు అలాంటి హిట్ పడేలా లేదు.
ఇటీవలే వచ్చిన రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాలను అట్టర్ ప్లాప్ చేసేసారు.ఈ మధ్య కాలంలో అక్కడ రెండెంకెల ఓపెనింగ్స్ తేవడమే గగనం అయిపోయింది.
దీంతో బాలీవుడ్ నిర్మాతలు సినిమాలను డైరెక్ట్ ఓటిటి కు ఇస్తున్నారు.దీంతో థియేటర్స్ కంటే ఎక్కువ డబ్బు వస్తుంది అని చూస్తున్నారు.
కానీ ముందు ముందు జరిగే నష్టం గురించి ఆలోచించడం లేదు.టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడుతుంది.మన నిర్మాతలు అందరు పూనుకుని మరీ ఈ పరిస్థితుల నుండి బయట పడేందుకు కృషి చేసి కొత్త సినిమాలు 8 వారాల తర్వాతనే రిలీజ్ చేస్తున్నారు.అయితే బాలీవుడ్ లో ఇందుకు విభిన్నంగా పరిస్థితి ఉండడంతో మరిన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మరి వీరి భయం ఎంత దూరం తీసుకు వెళుతుందో చూడాలి.